జిల్లా లెవెల్ పంచాయతీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి బలోపేతం చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వంలో పంచాయతీ నిధులను దారి మళ్ళించిందని, కనీసం సర్పంచులకు జీతాలు ఇవ్వాలని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల్లో సిసి రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అలాగే పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కలెక్టర్ డాక్టర్ సిరి ప్రారంభోత్సవం చేశారు.