అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో స్థానిక శ్రీ ఎర్రి తాత దేవాలయ ఆవరణము నందు ఐసిడిఎస్ , సిడిపిఓ ఎన్. శ్రీదేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో ఏకాంబరేశ్వరయ్య, ఏపీవో మురళీకృష్ణ, విఆర్ఓ ప్రదీప్ ముఖ్య అతిథులుగా పాల్గొని అంగన్వాడి కార్యకర్తలకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సీడీపీఓ మాట్లాడుతూ వయసు తగ్గ బరువు, ఎత్తు లేని పిల్లలకు జి జి ఎస్, ఎన్ఆర్సి అనంతపురంలో 14 రోజుల పోషకాహారం పై అవగాహన కల్పించారు. అలాగే బాల్య వివాహాలను అరికట్టాలని మానవహారం తో ప్రతిజ్ఞ చేశారు.