శ్రీశైలంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2027)పై సమీక్ష సమావేశం. పాల్గొన్న కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్. కలెక్టర్
శ్రీశైలంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2027) కార్యక్రమంపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.సమావేశంలో అధికారులు SIR-2027 సర్వేను నిర్దేశిత గడువులో పూర్తి చేసి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో డూప్లికేట్ మరియు అనర్హ ఓటర్ల నమోదును పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు.క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారంలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ నిర్వహించాలని సూచించారు. బీఎల్ఓ యాప్ ద్వారా ఓటర్ల ఫోటోలను తీసి అప్లోడ్ చేయలన్నారు.