కరకగూడెం: నిబంధనలకు విరుద్ధంగా భూపతిరావుపేట నుండి పడవను నడుపుతున్న నిర్వాహకుడిపై చర్యలు తీసుకున్న పినపాక MPO వెంకటేశ్వరరావు
పిడపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని భూపతిరావుపేట గోదావరి రేవు నుండి చర్ల మండలం ఎదిరకు పడవను నడుపుతున్న పడవ నిర్వహణపై ఎంపిఓ వెంకటేశ్వరరావు చర్యలు తీసుకున్నారు. ఎటువంటి వేలంపాట లేకుండా పడవను ఎలా నడుపుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పడవను ఎంపీఓ సీజ్ చేశారు.