వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రం సత్యభారతి ఫంక్షన్ హాల్ లో జిల్లాయూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం, పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్
ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక సత్యభారతి ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ కార్యదర్శి రఘువీరారెడ్డి,వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకఅని, కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని, యువ ఓటర్ల పై ముఖ్యంగా దృష్టి సారించాలని తెలిపారు.