వికారాబాద్: మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు -వికారాబాద్ పట్టణ ఎస్సై సత్యనారాయణ రాజు
మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని వికారాబాద్ పట్టణ ఎస్ ఐ సత్యనారాయణ రాజు తెలిపారు. ఈరోజు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. అయితే మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లేనని అంతేకాకుండా మద్యం తాగి వాహనాలు నడిపి ఒకవేళ పోలీసులకు చిక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.