నగరంలోని కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట బ్రిడ్జి వరకు చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు సంబంధించి టిడిఆర్ బాండ్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 12 గంటలు ఉస్మానియా కళాశాల, వడ్డేగేరి ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు సంబంధించిన కొలతలను కమిషనర్ పరిశీలించారు. కర్నూలు నగరాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రధాన రహదారుల విస్తరణ పనులు ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందని, ఇందుకు టిడిఆర్ బాండ్ల మంజూరులో పారదర్శకత, వేగం తప్పనిసరిగా ఉండాలని సూచించారు