పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం దిలావర్పూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ర్యాలీ నిర్వహించింది. దివ్యాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు రూ.4వేలు పింఛన్ పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ రమేశు వినతిపత్రం అందజేశారు.