బాత్ రూం లేదని పుట్టింటికి అలిగి వెళ్లిన భార్య, మనస్థాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త , ఎదురుపాడు లో ఘటన
ఇంట్లో బాత్రూం లేదని బాత్రూం కట్టించమంటే భర్త కట్టించడం లేదని అలిగి భార్య పుట్టింటికి వెళ్లడంతో, మనస్థాపానికి గురైన భర్త తేనె శివ శంకర్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు, కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన తేనె శివశంకర్ అనే యువకుడు ఇంట్లో బాత్రూం లేదని భార్య అలిగి వెళ్లడంతో భార్య కోసం పిలుచుకొని వెళ్లడానికి అత్తింటికి వెళ్లి పిలవగ భార్య రాకపోరాకపోవడంతో, మనస్థాపానికి గురైన శివశంకర్ తన ఇంటి వద్దకు వచ్చి పురుగుమందు తాగి ఆరవ తేదీ ఆత్మహత్యాయత్నం చేశాడు, అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందినట్లు ఎస్సై జయశంకర్ తెలియజేశారు,