యూరియా ఎరువు కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: చింతపల్లి మండల వ్యవసాయ అధికారి మధుసూధనరావు
యూరియా ఎరువు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చింతపల్లి మండల వ్యవసాయ అధికారి మధుసూధనరావు రైతులకు సూచించారు. గురువారం సాయంత్రం మండలానికి 36 మెట్రిక్ టన్నుల యూరియా లోడు వచ్చిందన్నారు. చింతపల్లి రైతు సేవా కేంద్రానికి 12 మెట్రిక్ టన్నులు, అన్నవరం 8, కొమ్మంగి 4, ప్రైవేట్ డీలర్ల వద్ద 12 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. యూరియా అవసరమైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.