విశాఖపట్నంలో ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు జరిగే సీఐటీయూ 18వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం కర్నూలు బళ్లారి చౌరస్తా సీ క్యాంపు సెంటర్, వైభవ్ కాలనీలో నూతన ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ జెండాలను ఎగురవేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక చలానాలతో ఆటో కార్మికులను దోపిడీ చేస్తున్నాయని నాయకులు విమర్శించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలపై విధిస్తున్న భారీ చలానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.