రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 11 వరకు 8,787 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు, అవసరమైతే ఒక నెల జైలుశిక్ష కూడా ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత కోసం ట్రాఫిక్ నియంత్రణను మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు.