శ్రీశైలం: ఘనంగా శ్రీశైల శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవారి వార్షిక కుంభోత్సవం. సాత్విక బలిగా వందల సంఖ్యలో గుమ్మడికాయలు సమర్పణ
శ్రీశైలం మాక్షేత్రంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాస పౌర్ణమి తరువాత వచ్చిన మంగళవారం సందర్భంగా ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజలు, జపపారాయణలు సంప్రదాయబద్ధంగా అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు.తదనంతరం ఆలయ ముందుభాగంలో రజకునిచేత ముగ్గు వేయించి అమ్మవారికి మొదటి విడత సాత్విక బలిగా వందల సంఖ్యలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలను ఆలయ ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు, భక్తులు సమర్పించారు.