గుంతకల్లు: ఏపీకి ఉపాధి హామీ నిధులు అధికంగా ఇవ్వాలి, పట్టణంలోని కార్యాలయంలో సీపీఐ నాయకులు డిమాండ్
దేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 90 శాతం ఉపాధి హామీ నిధులు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరభద్రస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దేవేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కార్యాలయంలో సీపీఐ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం నుంచి బండ్లపల్లి వరకు చేపట్టే పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను సీపీఐ నాయకులు విడుదల చేశారు.