స్పెషల్ కోచింగ్కు 104 మంది విద్యార్థులు ఎంపిక: పాడేరులో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
సూపర్-50 ద్వారా 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చేందుకు 53మంది బాలికలు, 51మంది బాలురు ఎంపికయ్యారని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదివారం రాత్రి తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షకు 538మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో 104మంది విద్యార్థులు సూపర్-50కి ఎంపికయ్యారన్నారు. వీరికి చింతపల్లి బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలలు, దిగుమోదాపుట్టు, గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాలల్లో కోచింగ్ ఇస్తామన్నారు.