మండపేట: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్ మంజూరు...
మండపేట అభిమానుల్లో ఆనందం...
మండపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కు శిరో ముండన కేసులో బెయిల్ లభించింది. దీంతో ఆయన మంగళవారం సాయంత్రం విశాఖపట్నం నుంచి బయలుదేరి మండపేట వస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఉదయం నుంచి ఈ కేసు పై పలువురు చర్చించుకోవడం విశేషం. కాగా కోర్టులో బెయిల్ మంజూరు కావడంతో ఆయన అక్కడి నుంచి మండపేట బయలుదేరుతున్నట్లు స్థానిక మీడియాకు తెలిపారు. తాను మండపేటలో పోటీలో ఉంటున్నానని వైసీపీ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించేందుకు మండపేట వెళుతున్నానని అక్కడి మీడియాతో స్పష్టం చేశారు. తోట కు బెయిల్ రావడంతో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు