చీమకుర్తి పట్టణంలో ఏపీ పంచ వృత్తిదారుల సంఘ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచ వృత్తిదారులైన వడ్రంగి, కుమ్మరి ,కంచరి, శిల్ప, స్వర్ణకార వృత్తిదారుల సమస్యలపై పంచ వృత్తిదారుల సంఘ అధ్యక్షుడు నాయుడు ప్రతాప్ ఆధ్వర్యంలో చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచ వృత్తిదారుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ప్రతాప్ ఆరోపించారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పంచ వృత్తిదారులకు అందించాలని డిమాండ్ చేశారు భూమిలేని వారికి భూములు, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.