కొత్తపేట, రావులపాలెం రైతు బజార్లలో తక్కువ ధరల బియ్యం అమ్మకానికి కేంద్రాలు ప్రారంభించారు. ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో బియ్యం మార్కెట్ కన్నా రూ.10-12 తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ కార్యక్రమం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో నడుస్తోంది.