అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలోని యజమాని దాదా ఖలందర్ కు చెందిన తినుబండారాల గోడౌన్లో గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన గురువారం ఉదయం 9 గంటలకు చోటు చేసుకుంది. ఎగిసిపడిన మంటల్లో గోదాములోని సామాగ్రితో పాటు ఇటీవల నూతనంగా కొనుగోలు చేసిన ఓమ్ని వాహనం సైతం మంటల్లో కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని గంటకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. పెను అగ్ని ప్రమాదంలో సుమారు 15 లక్షల పైగా నష్టం వాటిల్లినట్లు యజమాని వాపోయాడు.