కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా ఆదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.