అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మూడున్నర గంటల వరకు శ్రీ సనప మాధవ రాజుల స్వామి వారి తిరుణాల సందర్భంగా మాధవ రాజుల స్వామిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సనప నీలపాల రామకృష్ణ సిండికేట్ నగర్ రాజు తదితరులు మాట్లాడుతూ సనప గ్రామంలో శ్రీ మాధవ రాజుల స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయం వద్ద కమ్యూనిటీ హాల్ స్థానపు గదులు నిర్మాణం చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని సనప నీలపాల రామకృష్ణ , రాజు తదితరులు కోరడం జరిగింది.