శ్రీశైలం: ఇంధన పొదుపుకు అధికారుల వినూత్న అడుగు
వ్యక్తిగత వాహనాలకు బదులు బస్సుల్లో ప్రయాణించిన జిల్లా యంత్రాంగం
నంద్యాల జిల్లా అధికారులు ఇంధన పొదుపు కేవలం నినాదం కాదని ఆచరణలో నిరూపించారు. రాష్ట్ర ప్రభుత్వ “వన్ మంత్ - ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్తో పాటు జిల్లా స్థాయి అధికారులు వ్యక్తిగత వాహనాలను వినియోగించకుండా ప్రత్యేక బస్సుల్లో శ్రీశైలం నియోజకవర్గానికి బయలుదేరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంధన పొదుపు ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజలకు సందేశం ఇవ్వాలంటే ముందుగా అధికారులు ఆచరణలో చూపాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జిల్లా నుంచి మండల స్థాయి వరకు అధికారులు సమిష్టిగా బస్సుల్లో ప్రయాణించేలాన్నారు.