మండపేట: మండపేలో ఎన్నికల శిక్షణా తరగతులకు ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సివిల్ సప్లైస్ RO DVS ఎల్లారావు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు సోమవారం మధ్యాహ్నం డాక్టర్ పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులకు ఆలస్యం గా వచ్చిన కొందరు ఉపాధ్యాయులను సివిల్ సప్లైస్ R O DVS ఎల్లారావు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు స్కూల్ వద్ద బైఠాయించి ఆయన్ని బయటకు వెళ్ళనీయకుండా నిరసనకు దిగారు.అనంతరం తహసీల్దార్ వారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేసారు.