ప్రొద్దుటూరు: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్టు.. బారీగా నగదు స్వాధీనం
Proddatur, YSR | Nov 21, 2025 కడప జిల్లా పొద్దుటూరు పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ. భావన తెలిపిన వివరాల మేరకు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారినుంచి రూ.10.56 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలక వ్యక్తులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి చెందిన ఆర్ల చంద్ర యాదవ్ను శుక్రవారం డీఎస్పీ భావన ఆధ్వర్యంలో సీఐ సదాశివయ్య అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.