కోడుమూరులో మంగళవారం నీరు మరియు భూమి యాజమాన్య శిక్షణ పరిశోధన సంస్థ (వాలంతరీ) రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, వాలంతరీ డైరెక్టర్ విజయ గౌరీ, ఏడీఏలు సాలు రెడ్డి, వెంకటేశ్వర్లు వ్యవసాయాధికారులు అన్నపూర్ణ, రవి ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి వినియోగం, నేల సంరక్షణ, సమీకృత వ్యవసాయం, మల్చింగ్, అంతర పంటలు వంటి అంశాలపై రైతులకు వివరించారు. పెట్టుబడి తగ్గించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో శ్రేయస్కరం అన్నారు.