కర్నూలు: కర్నూలు జిల్లాలో 129 పాస్టర్ లకు 7 నెలల గౌరవ వేతనాన్ని 45,15, 000 లను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది: మంత్రి టిజి భరత్
ప్రేమ, శాంతి, కరుణ సమ్మిళితం క్రిస్మస్ పండుగ అని, క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి.జి.భరత్ తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటలకు కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో "క్రిస్మస్" పండుగ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "హై-టి" కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, తదితరులు పాల్గొన్నారు.