కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి జిల్లాజైలు, మహిళా జైలు ఆకస్మిక తనిఖీ చేశారు. లీగల్ ఎయిడ్ హెల్ప్డెస్క్ పనితీరును పరిశీలించి ఖైదీలకు ఉచిత న్యాయసహాయం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక న్యాయసహాయం అందిస్తామని చెప్పారు. ఖైదీల ఆహారం, ఆరోగ్య సేవలను తనిఖీ చేశారు. హెల్ప్లైన్ 15100పై అవగాహన కల్పించారు.