శ్రీశైలం: ఆత్మకూరు మండలంలో ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
ఆత్మకూరు మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో గురువారం వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.మండలంలోని వసుంధర ఫర్టిలైజర్స్ ,మల్లికార్జున ఫర్టిలైజర్స్, జిఎంఆర్ ఆగ్రో ఏజెన్సీస్, KDCMS డీలర్ల షాపులను ఇంటర్నల్ స్క్వాడ్ ఏ డి ఏ సి.సురేష్ ,ఆత్మకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు మండల వ్యవసాయ అధికారిని కె. హేమలత ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అధికారులు దుకాణాలలోని యూరియా , డీఎపి నిల్వలను పరిశీలించి వాటిని ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు .డీలర్ల వద్ద ఉన్న స్టాక్ రిజిస్టర్లు ,ఫిజికల్ బ్యాలెన్స్ డిబిటి రికార్డులను తనిఖీ చేశారు.