మంత్రి లోకేష్ వచ్చే ఎన్నికలలో 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం అనడం సంతోషదాయకం : శ్రీశైలంలో ఎంపీ శబరి
శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్న బైరెడ్డి శబరి పలు రాజకీయ అంశాలపై స్పందించారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, మందులు మరియు అద్దాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మహానాడులో 17 లక్షల మంది కార్యకర్తలు పాల్గొనడం ప్రపంచ రికార్డుగా అభివర్ణించారు. గతంలో 6 లక్షల మంది పాల్గొనగా, ఈసారి మహిళల భాగస్వామ్యం అధికంగా ఉందన్నారు.మహిళల రాజకీయ సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందని పేర్కొంటూ, 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్టీ మద్దతు తెలిపిందన్నారు. భవిష్యత్తులో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.