కర్నూలులో రామచంద్ర మిషన్, హార్ట్ పూల్ నెస్ మెడిటెషన్ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం పై అవగాహన ర్యాలీ చేశారు. ఉదయం 9 గంటలకు కర్నూలు రాజ్ విహర్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈర్యాలీ నిర్వహించారు. అందరూ ప్రకృతిని సంరక్షించాలని రామచంద్ర మిషన్ అధ్యక్షుడు వెంకట రెడ్డి తెలిపారు. చెట్లను నరకకుండా సంరక్షించాల్సిన భాద్యత అందరిపైన ఉందన్నారు.