ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోడుమూరు అంబేద్కర్ సర్కిల్లో మంగళవారం ఆ శాఖ నాయకులు విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న, సహాయ కార్యదర్శి రంగస్వామి హాజరై మాట్లాడారు. సహాయ కార్యదర్శి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా పట్టణంలో బీసీ హాస్టల్, మోడల్ స్కూల్ రహదారి అవస్థలపై గళమెత్తారు.