అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో శనివారం నాలుగు గంటల 35 నిమిషాల సమయంలో వెలుగు కార్యాలయంలో రాప్తాడు ఎంపీడీవో విజయలక్ష్మి ఉల్లాస్ అక్షర ఆంధ్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లాస్ అక్షర ఆంధ్ర చేపట్టబోతుందని అందుకు సంబంధించిన వాల్ పోస్టల్ ఆవిష్కరించిగ్రామీణ ప్రాంతాల్లోనూ మండల కేంద్రంలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేపడతామని అందులో భాగంగా వాల్ పోస్టులు ఆవిష్కరించామని ఎంపీడీవో విజయలక్ష్మి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో అచ్యుతనందబాబు రమణ సిసి ఉమాదేవి పాల్గొన్నారు.