కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని దిన్నెదేవరపాడులో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన నమూనాలను పరిశీలించారు. తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడారు. భోజనాలు వడ్డించి సహపంక్తి భోజనం చేశారు. కూటమి ప్రభుత్వం విద్యాసంస్థల్లో తీసుకుంటున్న పారదర్శక చర్యలను ఆయన వివరించారు.