ఆత్మకూరు గౌడ్ సెంటర్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు
ఆత్మకూరు పట్టణంలోని గౌడ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు భాస్కర్, శ్రీశైలం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, నియోజకవర్గ నాయకులు కంచర్ల గోవింద రెడ్డి, పాల్గొన్నారు