కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సోమవారం నియోజకవర్గ పరిధిలోని పసుపల గ్రామంలో డాన్ బోస్కో షికారి ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షికారి మహిళలు ఆర్థికంగా మెరుగుపడడానికి స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు తెలిపారు. డాన్ బోస్కో సంస్థ చేపడుతున్న సికారి ప్రాజెక్టు ద్వారా మహిళలకు జీవన ప్రమాణాలు పెంచడం అభినందనీయమన్నారు.