శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్ లో ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు బొలెరో వాహనం తప్పిన పెను ప్రమాదం
శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డులోని చింతల గిరిజన గూడెం వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు, తుఫాను వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో గంటపాటు రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాలను తొలగించే రాకపోకలను యధావిధిగా కొనసాగించారు