అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని ఉదిరికొండ తండా గ్రామం నందు ఆయిల్ ఫామ్ సాగుపై గురువారం హార్టికల్చర్ సిబ్బంది, ఎం కే ఆగ్రో టెక్ కంపెనీ ప్రతినిధులతో కలిసి జిల్లా ఉద్యాన అధికారిని ఉమాదేవి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హార్టికల్చర్ నుంచి కూడేరు మండలంలో ఆయిల్ ఫామ్ మొక్కలు ఎంకే అగ్రోటెక్ కంపెనీ ద్వారా రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, చీడపీడలు తెగుళ్ల నివారణ పై వివరిస్తూ హార్టికల్చర్ నుంచి1.0 హెక్టర్ కు గాను మెయింటెనెన్స్ రూ.5250 మరియు అంతర పంటకు కూడా 5250రూ . ఇవ్వడం జరుగుతుంన్నారు.