అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రసిద్ధిగాంచిన దేవాంగ కుల ఆరాధ్య దైవం కోటలోని శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల ఉత్సవాలు ఆదివారం ముగిసాయి. దేవాంగ జ్యోతుల కమిటీ అధ్యక్షులు రెడ్డి నాగరాజు ఆధ్వర్యంలో దేవాంగ కుల పెద్దలు, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని పట్టణ పురవీధుల్లో భారీ ఊరేగింపుగా పుర ప్రజలకు, భక్తులకు అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల కమిటీ అధ్యక్షులు రెడ్డి నాగరాజు మాట్లాడుతూ గత రెండు రోజులుగా జరిగిన జ్యోతుల ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన భక్తులకు, అధికారులకు దేవాంగ కుల సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.