ఉప్పల్ డివిజన్లో సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి నేతలు దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర అధ్యక్షుల పిలుపుతో డివిజన్ అధ్యక్షుడు మారినేని ఫణీంద్ర ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీఎం చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.