శ్రీశైలం: మహానంది అటవి ప్రాంతంలోని చలమ రేంజ్ లో రైలు ఢీకొని పెద్దపులి మృతి
నంద్యాల జిల్లా మహానంది అటవి ప్రాంతంలోని చలమ రేంజ్లో పెద్దపులి మృతి చెందింది. రైలు ఢీకొనడంతో పెద్దపులి ప్రాణాలు కోల్పోయినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ సమీపంలో పడిఉన్న పులి మృతదేహాన్ని అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం అక్కడికక్కడే పెద్దపులికి పోస్టుమార్టం నిర్వహించి, అటవీ నిబంధనల ప్రకారం మృతదేహాన్ని దహనం చేశారు. ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు