గుంతకల్లు: గుత్తి అర్ఎస్ పత్తికొండ సర్కిల్ లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు
అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే 199వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గుత్తి అర్ఎస్ పత్తికొండ రోడ్డు సర్కిల్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే 19వ శతాబ్దపు భారతీయ సామాజిక సంస్కర్త, విద్యావేత్త, సంఘసేవకుడు అన్నారు. కుల వివక్ష, అంటరానితనం, లింగ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాడని అన్నారు.