మండపేట: మండపేట మండలం తాపేశ్వరంలో ఏపి టిఎఫ్ ఫెడరేషన్ 80వ వసంతోత్సవ వేడుకలు..
ఏపి టిఎఫ్ ఫెడరేషన్ 80వ వసంతోత్సవ వేడుకలను సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం మండపేట మండలం తాపేశ్వరంలో ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు హృదయ రాజు పాల్గొని మాట్లాడుతూ.. 1944 ఏప్రిల్ 16న సంఘం తాపేశ్వరంలో పుత్తర సత్య శర్మ ఏర్పాటు చేశారన్నారు ఉపాధ్యాయుల సమస్యలపై అనేక పోరాటాలను 80 ఏళ్లుగా చేస్తుందని ఆయన అన్నారు విద్య ఉపాధ్యాయ సమస్యలపై తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.