ఆర్డీటీని ఐక్య ఉద్యమాలతోనే సాధించుకోగలం ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ సాకే హరి
Anantapur Urban, Anantapur | Jul 5, 2025
ఆర్డీటీని ఐక్య ఉద్యమాలతోనే సాధించుకోగలమని ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ సాకే హరి పిలుపునిచ్చారు.శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నగరంలోని పాదర్ విన్సెంట్ పెర్రర్ విగ్రహానికి ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో పూల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ సాకే హరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ నిధులు రాకుండా అడ్డుకోవడం చాలా అన్యాయమన్నారు.పేద ప్రజలకు ఆర్డీటీ చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉన్నాయన్నారు.పాదర్ విన్సెంట్ ఫెర్రర్ గొప్ప మానవత్వంతో జీవితకాలం సేవలు అందించాలన్నారు.