అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము: ఆర్డివో వెంకట శివ
అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డివో వెంకట శివ పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్,డీజిల్ నిల్వలను పరిశీలించారు. వ్యవసాయ పనులకు మాత్రమే వ్యవసాయ అధికారులు సూచించిన వారికి క్యాన్లలో డీజిల్ ఇవ్వాలన్నారు.ఇతరులకు క్యాన్లలో పెట్రోల్, డీజిల్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు.తహశీల్దార్ రత్న రాధిక,వ్యవసాయ అధికారి హేమలత తదితరులు పాల్గొన్నారు.