శ్రీశైలం: వెలుగోడు పట్టణంలో చావు ఇంట్లో దొంగతనం చేసిన దుండగులు
వెలుగోడు పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.ఓ వైపు ఇంటి యజమాని అనారోగ్యంతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే మరోవైపు దొంగలు ఇంట్లో పడి విలువైన సొమ్ము దోచేశారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధితులు తెలిపిన వివరాలమేరకు.నంద్యాల జిల్లా,వెలుగోడుపట్టణం లోని జమ్మినగర్ తండాకు చెందిన లక్ష్మయ్య అనారోగ్యంతో ఈనెల 7న చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో వెళ్ళారు. కుటుంబీకులు ఆయనకు తోడుగా అక్కడే ఉన్నారు. చికిత్స పొందుతూ కోలుకోలేక నేడు లక్ష్మయ్య( 52) మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారులున్నారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకొన్నారు.