గుంతకల్లు: యువతులు రాజకీయాల్లో రాణించాలి, పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.లక్ష్మయ్య
యువతి, యువకులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని రాణించాలని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఏ. లక్ష్మయ్య పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ' నారీ శక్తి వందన్ అధినీయం-2023' పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.లక్ష్మయ్య మాట్లాడుతూ దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. విద్యార్థినులు రాజకీయాల్లో రాణించాలని కోరారు.