కనిగిరి: బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బీసీ సంఘాల నాయకులతో కలిసి పూలే విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... కుల వ్యవస్థ, అంటరానితనం, దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే పోరాడారని గుర్తు చేశారు. ముఖ్యంగా శ్రీవిద్య వ్యాప్తి కోసం పూజ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు.