శ్రీశైలం: బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంబించిన MLA బుడ్డా
బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను MLA బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీయే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమేనని పేర్కొన్నారు. ప్రతి పల్లెలో పూర్తిస్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చడమే ప్రభుత్వ ధ్యేయమనన్నారు.