వీఐపీల రాక సందర్భంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం : ఎస్పీ సతీష్ కుమార్
పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతోత్సవాల సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, పుట్టపర్తిలో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, సత్యసాయి ట్రస్ట్ సభ్యులతో కలిసి భద్రతా ప్రణాళికపై చర్చిస్తున్నామని ఎస్పీ తెలిపారు.