కడ్తాల్: ప్రకృతిని విస్మరిస్తే జీవకోటి మనగడ ప్రశ్నార్థకంగా మారుతుంది: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫౌండర్ లక్ష్మారెడ్డి
రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం, హనుమాస్పల్లి ఎర్త్ సెంటర్లో షాబాద్ పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫౌండర్ లక్ష్మారెడ్డి రెండు రోజులపాటు వర్క్ షాప్ ను నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మాట్లాడుతూ.. ప్రకృతిని విస్మరిస్తే జీవకోటి మొనగాడా ప్రశ్నార్ధకంగా మారుతుందని, సహజ సిద్ధమైన వనరులను కాపాడే బాధ్యత ప్రతి ఒకరి పైన ఉన్నదని చెప్పారు. ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కలిగి ఉండాలన్నారు.